ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ని దాచేపల్లిలో జరిగిన దారుణ ఘటన పై ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీపై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా పై టీడీపీ సభ్యులు మండి పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేత యరపతి..రోజాపై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా తెలుగుదేశం నాయకురాలు శోభారాణి మండిపడ్డారు. మనిషి అన్నాకా కాస్త బుద్దీ జ్ఞానం ఉండాలి..ఎన్ని జరిగినా వైసీపీ ఎమ్మెల్యే రోజాలో మార్పు రావడం లేదని తెలుగుదేశం నాయకురాలు శోభారాణి  ఆగ్రహం వ్యక్తం చేశారు.  సాక్షాత్తు ముఖ్యమంత్రిని, హోంమంత్రిని పట్టుకుని 'దద్దమ్మ' అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Image result for roja
రోజా గత జీవితం ఏమిటని, ఎక్కడి నుంచి ఆమె జీవితం ప్రారంభమైందని అడిగారు. చంద్రబాబును విమర్శించే హక్కు ఆమెకు ఉందా? అని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన పదవికి న్యాయం చేయకపోగా... టీడీపీని వదిలి, 420లంతా కలసి పెట్టుకున్న పార్టీలో చేరి, అక్కడ ఆమె కూడా 420గా మారిందని దుయ్యబట్టారు. చట్టాలపై ప్రజలకు గౌరవం పెరగాలంటే... రోజాలాంటి వ్యక్తులు ప్రజాజీవితంలో ఉండకూడదని శోభారాణి అన్నారు.
Image result for roja
జబర్దస్త్ ప్రోగ్రాంలో సగంసగం దుస్తులు వేసుకుని, బూతు డైలాగులు, బూతు పాటలకు డ్యాన్సులు చేస్తోందని విమర్శించారు. జబర్దస్త్ లాంటి ప్రోగ్రాముల వల్లే దాచేపల్లిలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. విధ్వంసాలను సృష్టించేందుకు రోజాను వైసీపీ ఉపయోగించుకుంటోందని శోభారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: