తిరుమల:- వేసవి సెలవులతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారి దర్శనానికి అధిక సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 57 గంటలు, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.41కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారిని 85,354 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది...