శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ ఇంట విషాదం నిండుకుంది.  క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రి రంజన్ డిసిల్వను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 62 ఏళ్ల రంజన్, గత రాత్రి 8.30 గంటల సమయంలో కొలంబోలోని దేహివాలా - మౌంట్ లావినియా ప్రాంతంలోని జ్ఞానేంద్ర రోడ్డులో ఉండగా, ఓ వ్యక్తి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటన కొలంబోకు సమీపంలో ఉన్న రత్‌మలాన్ ప్రాంతంలో జరిగింది.
శ్రీలంక క్రికెటర్ తండ్రి కాల్చివేత
వెస్టిండీస్ టూర్ కోసం క్రికెటర్ ధనంజయ్ డిసిల్వ పయనమవుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ధనంజయ్ తండ్రి రంజన్.. స్థానికంగా ఓ రాజకీయ నేత. అయితే ఆ మర్డర్ కేసులో విచారణ నిర్వహిస్తున్నారు.
Image result for ధనుంజయ డిసిల్వ
ఇదే ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని ఇంతవరకూ గుర్తించలేదని, కేసును విచారిస్తున్నామని అన్నారు. కాగా, తండ్రి హత్యతో నేడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన డిసిల్వ ఆగిపోయాడు. జూన్ 6 నుంచి శ్రీలంక జట్టు వెస్టిండీస్ తో మూడు టెస్టు మ్యాచ్ లను ఆడాల్సివుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: