దీంతో విజయసాయిరెడ్డి డిల్లీలో ఉంటే అమరావతిలో ఉన్న చంద్రబాబుకి కింద పైన తడిసిపోయేది. ఇటీవల తిరుమల తిరుపతి వెంకన్న నగల వ్యవహారంలో కూడా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీతో సహా మిగతా రాజకీయ పార్టీ నాయకులకు కూడా మతిపోయింది. తిరుమల వెంకన్న నగలు స్వయంగా చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని……. బాబు ఇంట్లో సెర్చ్ చేశాక నగలు దొరక్కపోతే ఎంపి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరాడు విజయసాయి.
ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలో విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కంటే ఎక్కువగా చక్రం తిప్పుతున్న ననడంలో సందేహం లేదు అని చెప్పవచ్చు.. ఇందులో భాగంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పచ్చ బ్యాచ్ అందరికంటే ముందుగానే కనుక్కుని బాబు బ్యాచ్ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి గంటా వర్గం మొత్తం తమకు టచ్లో ఉందని కూడా బాబును హెచ్చరించాడు విజయసాయి.
అయితే చంద్రబాబు మాత్రం మహానాడు వేదికగా విజయసాయి మాటలపై స్పందించే ధైర్యం చేయలేకపోయాడు. నారాలోకేష్ అవినీతి వ్యవహారాలతో సహా చంద్రబాబు అవినీతి, అక్రమ వ్యవహారాలపై తాజాగా కూడా బాబు అండ్ కోకు ఛాలెంజులు విసిరాడు విజయసాయి. అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం కనీసం స్పందించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాలే మహానాడు వేదికగా టిడిపి నేతల మధ్య చర్చనీయాంశం అవుతున్నాయి.