ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు జరగుతున్న ఈ పాదయాత్రలో జగన్ కు ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే సినీ ప్రముఖుల వద్ద నుండి కూడా జగన్ కు మద్దతు లభిస్తుంది. తాజాగా నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వి రాజ్ పాదయాత్రలో కలిసి పాల్గొనగా నిన్న జగన్ సీఎం అయ్యే ఛాన్స్ కనపడుతుందంటూ సూపర్ స్టార్ కృష్ణ అభివర్ణించాడు.


అయితే జగన్ పాదయాత్రను కొనియాడడం ఇప్పుడు ఇంకో కుర్ర హీరో వంతయింది. మంచు వారి కుటుంబం నుండి వచ్చిన హీరో మంచు విష్ణు జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల జల్లు కురిపించాడు. నేడు పశ్చిమగోదావరి జిల్లాలోని శుక్రవారం తణుకులో గల స్ప్రింగ్‌ బోర్డు పాఠశాలకు ఒక కార్యక్రమం నిమిత్తం హాజరయిన హీరో మంచు విష్ణు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్ పాదయాత్రను మెచ్చుకున్నారు.


ప్రజల సమస్య తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పాదయాత్ర చేసిన ఎవరూ  ఓటమి పాలుకాలేదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే మాదిరి పాదయాత్ర చేసి అఖండ విజయం సాధించిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను రోజుకు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి చాలా ఆయాస పడతానని, అలాంటిది జగన్ మోహన్ రెడ్డి రెండు వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం సాధారణ విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నుండి మంచు మోహన్ బాబు పొటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్న సమయంలో విష్ణు ఈ వాఖ్యలు చేయడం వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: