సాధారణంగా కొన్ని సందర్భాల్లో జరిగే సంఘటనలు చూస్తానికి మామూలుగా ఉన్నా..వాటి గురించి చర్చలు మాత్రం బాగా ఉంటాయి.  తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి చోద్యమే ఒకటి జరిగింది.  కాకపోతే అది ప్రకృతి పరంగా కాదు..ఓ విద్యార్థి చమత్కారం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న ఎస్ఎస్సీ సప్లిమెంటరీ హిందీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు జరిగింది. 

అయితే ఈ పరీక్షకు ఏడుగురు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నా..ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యాడు. ఈ ఒక్కడి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, అటెండర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి, ఇద్దరు కానిస్టేబుళ్లు తమ విధులను నిర్వహించారు.

వీరికి తోడు తనఖీల కోసం కరీంనగర్ నుంచి రెండు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు వచ్చాయి. ఒక్కో బృందంలో ఇద్దరిద్దరు చొప్పున అధికారులు ఉన్నారి. వీరికి పోలీసు బందోబస్తు అదనం.  


మరింత సమాచారం తెలుసుకోండి: