హైదరాబాద్ లో మరో శిశువు కిడ్నాప్.  పది రోజుల పసికందును ఎత్తుకెళ్లిన కిడ్నాప్ ముఠా. అమీర్ పేట లో అమ్మడానికి తీసుకు వెళ్లిన దంపతులు.  స్థానికుల సహకారంతో నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   కాగా, మొన్న కోఠి ప్రభుత్వ ఆసు పత్రి నుంచి ఓ శిశువుని మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అదృశ్యమైన ఆడశిశువు ఆచూకీ పోలీసులకు దొరికింది.

ఆ పాప బీదర్‌లో ఉందని తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.  కాగా, కోఠిలో కిడ్నాప్  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా పలు ఆధారాలు లభ్యమయ్యాయి.

అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం గాలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ పసిపాప బీదర్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దొరికిందని పోలీసులు అంటున్నారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు అమీర్ పేటలో మరో కిడ్నాప్ ముఠా కలకలం రేపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: