"నరెంద్ర మోదీ లాంటి ప్రధాని లభించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఆయన గురించి ఏవేవో మాట్లాడుతుంటాయి. కానీ దేశం కోసం పని చేస్తున్నదేవరో ప్రత్యక్షంగా చుస్తూనే ఉన్నాం కదా!" అంటున్నారు బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలిని. బుధవారం రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి హాజయరయ్యారు హేమ మాలిని. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
ఆ సమయంలో విలేకరులు "ఒక వేళ అవకాశం వస్తే మీరు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారా? అని అడగ్గా, అందుకు హేమమాలిని "నేను తల్చుకుంటే ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద విషయమేం కాదు. కానీ అది నాకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని, స్వతంత్రాన్ని, సమయాన్ని కోల్పొవాల్సి వస్తుంది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు.
అంతేకాక ‘నేను మంత్రిని అవ్వడానికి కారణం నా సినీ జీవితం. ప్రజలు నన్ను డ్రీమ్ గర్ల్ హేమమాలిని అని పిలుస్తారు. నేను బాలీవుడ్ లో పనిచేశాను. అందువల్లే నన్ను అందరూ గుర్తించగల్గుతారూఅని’ తెలిపారు. అంతేకాక ‘పార్లమెంట్ లో ప్రవేశించక ముందే నేను బీజేపీ కోసం చాలా పని చేశాను. పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ నాలుగేళ్ల లో నా నియోజకవర్గం మధుర లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఇక్కడ రహదారుల అభివృద్ధికి అధికంగా కృషి చేశానని’ తెలిపారు.