తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆయన పరేడ్ మైదానంలో ఉన్న సైనికుల స్మారకం వద్ద ఘన నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు వెళ్లిన ముఖ్యమంత్రి... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- ఈరోజు నుంచే రైతు బీమా పథకం అమల్లోకి వస్తుంది.
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా రు. 6 లక్షలు ఇస్తాం.
- డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ పై చిన్న, సన్నకారు రైతులు, దళితులకు 90 శాతం సబ్సిడీ కల్పించబోతున్నాం.
- మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాం.
- 22.47 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టాం.
- నవంబర్ లో రైతుబంధు రెండో విడత చెక్కులు పంపిణీ చేస్తాం.
-కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం.
-గొల్లకుర్మలకు 65 లక్షల గొర్రెలతో పాటు దాణాను పంపిణీ చేస్తున్నాం.
-బర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం.
-మత్స్యకారులను ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం.
-చేనేత, పవర్ లూమ్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
-సంచార కులాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాం.
-24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
-రికార్డు సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేశాం.
-త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరించబోతోంది.
-మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేస్తున్నాం.
-హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.
-ఇప్పటి వరకు 2,72,723 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాం.
-పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తయారవుతోంది.
-5 వేల మంది మౌజమ్, ఇమామ్ లకు జీవనభృతి కల్పించాం.
-హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీగా అవతరిస్తోంది.
-ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం పోలీసుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది.
-హైదరాబాదులో మరో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం.
-జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులను బాగు చేస్తున్నాం.
-త్వరలోనే మెట్రో రెండో దశ సేవలు ప్రారంభమవుతాయి.
-ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాం.
-మిషన్ భగీరథ దాదాపుగా పూర్తి అయింది.
-ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్సులు అందిస్తున్నాం.
-బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం.
-రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం.
-మైనార్టీ యువతకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నాం.
-విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం.
-నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఆధునిక వస్తువులు అందజేస్తాం.
-వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కును నిర్మిస్తున్నాం.
-4 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్నాం.
-ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తున్నాం.
-దళితులకు 12,974 ఎకరాల భూమిని పంపిణీ చేశాం.
-7 జోన్లు, 2 మల్టీ జోన్లకు త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది.
-ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది.