ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. తాజాగా ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన నారా హమారా టీడీపీ హామారా భారీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. ముఖ్యంగా ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేసి ఇష్టమొచ్చినట్లు తనపై కాలంతో చేస్తున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి లోకేష్ దారుణంగా కామెంట్లు చేశారు...
అంతేకాకుండా తనపై విపక్ష పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఢిల్లీలో ఉండి మద్దతును కూడగడుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎటు వెళ్లాడని లోకేష్ ప్రశ్నించారు. పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలుసునని చెప్పారు.
కానీ, కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ స్టార్ పవర్ఫుల్ అనుకొన్నా....ఆయన పవర్ లెస్ స్టార్ అన్ని పేర్కొన్నారు.
గతంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ కి...కన్నడ ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారు...ఏపీలో ఆంధ్ర ప్రజలు అదిరిపోయే సినిమా 2019ఎన్నికల్లో చూపిస్తారని అన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అదేవిధంగా...దేశ ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారని జోస్యం చెప్పారు లోకేష్.