జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత ప్రజా పోరాట యాత్ర కు సిద్ధమైపోతున్నారు. గతంలో కంటి శాస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాదులో తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న పవన్ ఎన్నికలు దగ్గరకొస్తున్న కలదే జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి 2019 ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో కీలకపాత్ర పోషించాలని సరైన వ్యూహాలు చాపకింద నీరులా గీస్తున్నారు.

Image may contain: 5 people, beard and outdoor

ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దర్గాను సందర్శించారు.రొట్టెలను మార్చుకుని భక్తి ప్రపత్తులను తెలియపరుచుకున్నారు. కాగా రొట్టెల పండగలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా పాల్గొన్నారు.

Image may contain: 4 people, people smiling, people sitting

ఆ తర్వాత ఆయన తన బాల్య స్నేహితులను, తనకు విద్య నేర్పిన గురువులను కలుసుకున్నారు.వారితో ఆయన తన అనుభూతులను పంచుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేనలో పార్టీలో చేరేవారు తనపై అబిమానంతో కాకుండా,సమాజంపై ప్రేమతో చేరాలని అన్నారు.

Image result for pawan kalyan ali at nellore

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రొట్టెల పండుగ లో పాల్గొనడంతో నటుడు ఆలీ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తారా అన్న వదంతులు వినపడుతున్నాయి. ఒకవేళ ఆలీ పోటీ చేస్తే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున పోటీ చేస్తారు అని అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు... జనసేన కార్యకర్తలు.




మరింత సమాచారం తెలుసుకోండి: