భారత దేశంలో ఈ మద్య కొంత మంది మృగాళ్లు కామంతో రెచ్చిపోతున్నారు. వయసు తో సంబంధం లేకుండా ఆడవారిపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా ఓ చిన్నారిపై కన్నేసిన ఇద్దరు నీచులు ఆమెపై మిఠాయిల ఆశ చూపారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.   సాధారణంగా గుడికి వెల్లిన భ‌క్తుల‌కు పూజారులు పూజ చేసి ఆశీర్వ‌చ‌నాలు అందిస్తారు. అలాంటి పూజారులే దారుణానికి వ‌డిగ‌ట్టారు.  కానీ మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలో ఇద్దరు పూజారుల మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. 

వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలో ఓ బాలిక(5)పై ఊరిలోని గుడి పూజారులు రాజు పండిత్(55), బతోలీ ప్రజాపతి(45) కన్నేశారు. మిఠాయిలు కొనిస్తామని ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు ఏడుస్తూ ఉండటంతో మిఠాయిలు కొనిచ్చి ఇంటి వద్ద దించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. అయితే బాలిక మాత్రం నొప్పితో విల్లవిల్లాడుతూ ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది.
5 Year Old Allegedly Raped by Two Priests in Temple
దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసు సదరు నీచ పూజారులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి, బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ పూజారులు తమపట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారని పలువురు బాలికలు చెబుతున్నారు. కాగా, 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించే చట్టాన్ని గతేడాది డిసెంబర్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ గత ఏడు నెలల్లో 12 మంది దోషులకు కోర్టులు మరణదండన విధించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: