ఈ మద్య విద్యార్థుల బలహీనతలు కొంత మంది దళారులు ఈజీగా క్యాష్ చేసుకుంటున్నారు.  విద్యార్థులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి వారికి నమ్మకం కల్పించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఫిజులు దండిగా వసూళ్లు చేసిన తర్వాత బిషానా ఎత్తి పడేస్తున్నారు.  తాజాగా ఎంబీబీఎస్ పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తామని ఓ ప్రబుద్ధుడు ఓ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీన్ని నమ్మి చేరిన విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు  నగదు మొత్తం తీసుకుని పారిపోయాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  నెల్లూరు జిల్లాకు చెందిన రమణారెడ్డి 3 నెలల క్రితం విజయవాడలో ‘నేషనల్ మెడికల్ అకాడమీ’ పేరిట కోచింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. 9 నెలల శిక్షణ కోసం రూ.1.50 లక్షలను ఫీజుగా నిర్ణయించాడు. దీనికోసం అడ్వర్టైజ్ మెంట్ కూడా భారీ ఎత్తున చేయడంతో దాదాపు  54 మంది విద్యార్థులు ఈ సంస్థలో చేరారు. 

వారి వద్ద నుంచి ఫీజులు వసూళ్లు చేసి రాత్రికిరాత్రే కోచింగ్ సెంటర్ ను మూసేసి పరారయ్యాడు. మరుసటి రోజు కోచింగ్ సెంటర్ కు వచ్చిన విద్యార్థులు మూసి ఉండటంతో నిర్వాహకుడైన రమణారెడ్డికి ఫోన్ చేశారు. కానీ అతని  ఫోన్ కలవకపోవడంతో రెండు, మూడు రోజులు ఎదురుచూశారు. చివరికి తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. 
  ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: