పవన్ మైక్ దగ్గర కి దగ్గరికి వస్తే చాలు ఆవేశం లో ఏం మాట్లాడతాడో తనకే అర్ధం కాదు. కొన్ని సార్లు ఆవేశం లో మాట్లాడిన మాటలు అతనికి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.  తాజాగా ఆయన యూపీ నాలుగు ముక్కలు అయిపోగాక అంటూ శపించారు. అదేమంటే.. అంత పెద్ద రాష్ట్రం చూసుకొనే కదా బీజేపీకి పొగరు అని అనేస్తున్నారు. బీజేపీ మీద కోపం యూపీ వాళ్ల మీద చూపించాల్సిన అవసరం ఏముంది? కావాలంటే బీజేపీ పది ముక్కలైపోవాలి.. మోడీ వ్యతిరేకులంతా ఒక జట్టు కట్టాలి?  అర్జెంట్ గా మోడీని కుర్చీ దిగేలా చేయాలి.. ఇలా శాపనార్థాలు పెట్టాలి కానీ.. తెలుగు రాష్ట్రం ముక్కలైంది కాబట్టి మరో రాష్ట్రం కూడా అలా కావాలని కోరుకోవటం ఏమిటి పవనా? అన్నది ప్రశ్న.


అంతేనా.. అప్పుడెప్పుడో ఒక ఓటు.. రెండు రాష్ట్రాలని బీజేపీ అన్నదని.. దాన్ని ఎవరూ ప్రశ్నించలేదని విరుచుకుపడే పవన్.. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానన్న విషయాన్ని మర్చిపోకూడదు. అర్థం లేని ఆవేశం ఎంత అనర్దమో.. సరైన ఆలోచన లేని మాటలు కూడా అంతే చేటు చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం కష్టాలు పడుతున్నాం కాబట్టి.. ఎదుటోళ్లు కూడా కష్టాలు పడాలనుకోవటం.. శాపాలు పెట్టటం సరైనది కాదు. 


పవన్ మాటలు దేవుడికే అర్ధం కావు... ప్రజలకు ఏం అర్ధం అవుతాయి...!

ఇంతకాలం రీల్ హీరోలా విలన్ భరతం పట్టిన పవన్.. రియల్ లైఫ్ లోనూ ఏపీకి నష్టం చేస్తున్న వారు.. అన్యాయం చేస్తున్న విలన్స్ ను వ్యూహాత్మకంగా చిత్తు చేయాలే తప్పించి.. ఆవేశంతో మైకు ముందుకు వచ్చి యూపీ.. నాలుగు ముక్కలైపోయాలి.. బీహార్ మూడు ముక్కలు కావాలని అనుకోవటం సరైంది కాదు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇలాంటి పనికిమాలిన శాపాలు పెట్టే కన్నా.. ఆంధ్రోళ్లకు ఉపయోగం కలిగేలా మాట్లాడితే మంచిది. ఇంతకీ.. పవన్ ఈ తీరులో శాపాలు ఎందుకు పెడుతున్నట్లు అన్నది చూస్తే.. ఆయన వెనుక మోడీ ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో అదేమీ లేదన్న దానికి పడే అవస్థల్లోనే ఈ శాపాల పర్వంగా చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: