తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయడం. రాజ్భవన్లోని దర్భార్ హాలు వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు తరలిచవ్చారు. గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్భవన్లో కేసీఆర్తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కేసీఆర్ తో పాటు మహమూద్ ఆలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. కేటీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కేసీఆర్ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేశారు. ప్రమాణస్వీకారం పూర్తవగానే కేసీఆర్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు.
కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణం అనంతరం జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీ మీడియా కోసం ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్రావుతో పాటు మహమూద్ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.