తెలంగాణ లో ఎన్నికలప్పుడు మీడియా హడావిడి మాములుగా లేదు అయితే అది తెరాస కు అనుకూలంగా కాదు వ్యతిరేకంగా, దీనితో తెరాస కు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇప్పుడు కసి తీర్చుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ మాంచి మెజారిటీ తో సింహాసనం అధిష్టించగానే తెలుగునాట ఓ సామాజిక వర్గం గుప్పిట్లో వున్న మీడియా, అది ప్రింట్ కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు. పూర్తిగా సైలంట్ అయిపోయింది. కిక్కురు మనడం లేదు. ఇదే కనుక కాంగ్రెస్ ప్రభుత్వమో, జగన్ ప్రభుత్వమో అయితే వేరేలా వుండేది పరిస్థితి.

Image result for kcr

ముఖ్యమంత్రి వైఖరి ఏమిటి? ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రులు ఏరీ? శాసనసభను ముందుగా రద్దు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన స్థంభించింది. మంత్రుల లేక ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఎమ్మెల్యేలు లేక అధికారుల ఇష్టారాజ్యంగా వుంది.  ఇలా రకరకాల కథనాలు పుట్టుకు వచ్చేవి.  సరే, ఈ సంగతి పక్కన పెడదాం, జాతీయ మీడియాలో కావచ్చు, లేదా ఎక్కడో నేషనల్ వెబ్ సైట్ లో కావచ్చు, జగన్ కు పది కిలోమీటర్ల దూరం వుండే వార్త వచ్చినా తెలుగుదేశం అను'కుల'మీడియా రెచ్చిపోతుంది.

Image result for media news paper

ఆ పది కిలోమీటర్ల దూరాన్ని, తీసేసి, నానా లింకులు కలిపేసి, నానా హంగామా చేస్తుంది. తెలంగాణ ఎన్నికల తరువాత నేషనల్ చానెళ్లలో, మీడియాలో ఓటింగ్, కౌంటింగ్ వ్యవహారాలపై స్కామ్ అంటూ బోలెడు స్టోరీలు పుట్టుకు వచ్చాయి. ఇక్కడ మీడియా పొరపాటున కూడా వాటిని టచ్ చేస్తే ఒట్టు. ఎందుకు? ఏమిటి? దానికి కారణం కేసీఆర్ . జగన్ , లేదా కాంగ్రెస్ అయి ఉంటే ఈ మీడియా రెచ్చిపోయేదేమో కానీ ఇక్కడున్నది కేసీఆర్ దీనితో మీడియా కు తాళం పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: