దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనకు మించిన తీరులో రానున్న
రోజుల్లో పాలన సాగనుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు
వెల్లడైన వెంటనే ఎన్నికైన ప్రజాప్రతి నిధులు ప్రమాణ స్వీకారం చేయటం రాజ్యాంగ సాంప్రదాయం.
అందుకు భిన్నంగా, తాను తనకు నచ్చిన ఇద్దరు వ్యక్తులతో ప్రమాణం చేయించి ఆయనకు రాజ్యాన్ని అప్పగించి మిగిలిన వారంతా ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ తప్పించి మరెవరూ ఉండరంటున్నారు.
కాంగ్రెస్ ఈ విషయంపై ఎలాంటి రాజ్యాంగబద్ధతను ప్రశ్నించే సామర్ధ్యం లేనిదై పోగా రాష్ట్రంలో చట్టం చట్టుబండలైంది. ఇప్పుడు దొరవారి సేనాని హోం మంత్రిగా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే శాంతి భద్రతలకు ఢొకా లేదు కాని మిగిలిన వ్యవస్థలు అవస్థలపాలైనా ఫరవాలేదా? శాసనమండలిలో ప్రతిపక్షం శూన్యం అయింది. తెలుగుదేశం శాసనసభాపక్షం హారతి కర్పూరం అవనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం మగతనం లేకుండా నిక్కీ నీల్గుతుంది. క్రమంగా కాంగ్రెస్ ష్రింక్ అయి పోతుంది. తెలంగాణాలో ముందురానున్న పాలన ఎమిటో తెలుస్తూనే ఉంది. ఎలా ఉండబోతోందో రూపురేఖలు అర్ధమౌతూనే ఉన్నాయి. పార్టీని యువరాజుకి పాలనను సేనాధిపతికి అప్పగించి ప్రక్కరాజ్యాలపై దండయాత్రలకు, తీర్ధయాత్రలకు వెళ్ళిన చక్రవర్తి లా మన దొర ప్రవర్తిస్తున్నారు. రాజవారు జైత్ర యాత్రలు పూర్తి చేసుకొని రాగానే పాలన మొదలౌతుందన్న మాట.
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఒకసారి ఎన్నికలు ముగిసి, భారీ మెజార్టీని మూటకట్టుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించని ఘనత కేసీఆర్ సొంతంగా చెబుతున్నారు.
మొత్తం 119 స్థానాలకు 88 స్థానాల్ని సొంతం చేసుకొని మరో ఇద్దరు ఇప్పటికే పార్టీలో చేరిన తర్వాత కూడా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవం ఎప్పుడున్న విషయం ప్రజాప్రతినిదులకు కూడా తెలియని చిత్రమైన పరిస్థితి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమంటున్నారు.
ఎన్నికలు అయిన వెంటనే ప్రజాప్రతినిధుల చేత ప్రమాణస్వీకారం చేయటం అసెంబ్లీ
కొలువు తీరటం లాంటివి వెంటవెంటనే జరిగే పరిణామాలని కానీ, అందుకు భిన్నంగా
వ్యవహరించే దమ్ము, ధైర్యం దేశంలో మరే ముఖ్యమంత్రికి లేదని, అది మొత్తంగా
కేసీఆర్కు మాత్రమే సాధ్యమంటున్నారు. ఆయన కానీ ఆయన వారసులు మాత్రమే
ఇలాంటివి చేయగలుగుతారని చెబుతున్నారు.
ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్నా వారాల తరబడి ప్రమాణస్వీకారం చేయకుండా ఉండటం కేసీఆర్కే చెల్లు అని చెప్పక తప్పదు. తెలంగాణాలో వారాలు గడుస్తున్నా శాసన సభ ఏర్పడ లేదు - రాజ్యాంగం దొర ముందు నిక్కి-నీల్గు తుందా? ప్రజాస్వామ్యం తెలంగాణాలో కునారిల్లనుందా?