2019 ఎన్నికలు ఇప్పడూ అధికార పార్టీ అయినా టీడీపీ కి మరియు ప్రతి పక్ష పార్టీ అయినా వైస్సార్సీపీ కి చాలా ముఖ్యం. అయితే 2019 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో ఇప్పటికే చాలా సర్వేలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే . అయితే  సర్వేలు కంటే కరెక్ట్ గా స్థానికంగా ఉండే ఓ సామాన్యుడు చెప్పగలడు. మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదేమాట అంటున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది జగన్ అనే విషయాన్ని ప్రతి సామాన్యుడు చెబుతున్నాడని అంటున్నారు ఉండవల్లి.

Image result for jagan padayatra

"పోలీసులు పబ్లిక్ లో ఉంటారు. వాళ్లకు తెలుసు, ఎవరు అధికారంలోకి వస్తారో. ఎమ్మెల్యే వెళ్తుంటే ఇలా చూస్తుంటాడు. సెల్యూట్ చేయడు, ఎందుకంటే వాడికి అర్థమైపోయింది మళ్లీ ఆ ఎమ్మెల్యే రాడని. అదే అపోజిషన్ నేత రోడ్డుపై వెళ్తుంటే మాత్రం సెల్యూట్ కొడతాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ లో రోజూ ఉండేవాళ్లు పోలీసులు. రాజకీయ గాలి ఎలా మారుతోందో వాళ్లకు తెలిసిపోయింది."

జగన్ సీఎం అవుతాడని పోలీసులు చెబుతున్నారు

ఈసారి జగన్ రావడం ఖాయమనే విషయాన్ని ఉండవల్లి ఇలా విశ్లేషించారు. జగన్ పాదయాత్రలకు వస్తున్న జనాల్ని ఇప్పటివరకు తన జీవితంలో చూడలేదంటున్న ఉండవల్లి.. జగన్ ను వైఎస్ కంటే పెద్ద వక్తగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవ్యక్తి దేవుడు. ఆ దేవుని కుమారుడు జగన్. ఇప్పుడు పాదయాత్రలో ఇంతమంది జనం వస్తున్నారంటే దానికి కారణం ఆ దేవుడే. ఇండియాలో ఇప్పటివరకు నేనుచూసిన పాదయాత్రల్లో ఏ పాదయాత్రకు ఇంత రెస్పాన్స్ లేదు. ఒకటే జనం. అప్పుడెప్పుడో గాంధీగారి పాదయాత్రకు వచ్చారేమో. లక్కీగా జగన్ కూడా జనాలకు కమ్యూనికేట్ చేయగలగుతున్నారు. వాట్ ఐయామ్ సేయింగ్ లాంటి డైలాగులు చెప్పడంలేదు. తండ్రి కంటే గొప్ప స్పీకర్ జగన్." ఇదే సమయంలో జగన్ కు ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు ఉండవల్లి. గెలుపు గ్యారెంటీ అనేధీమాతో ఉండొద్దని, చంద్రబాబు మామూలోడు కాడని, ఆఖరి నిమిషం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: