కె.ఎ.పాల్... ప్రజాశాంతి పార్టీ ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కె.ఎ.పాల్.. ఎన్నికల ముందు మళ్లీ దూసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పాల్.. పలు సంచలన అంశాలు వెల్లడించారు.

Image result for k a paul party

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పాల్ స్పష్టం చేసారు. పలు అగ్రపార్టీలు తనతో టచ్ లో ఉన్నాయంటున్నారు. ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అగ్రపార్టీలన్నీ ఉత్సాహం చూపిస్తున్నాయని వెల్లడించారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే తమ్ముడు పవన్ కల్యాణ్ ఓకే అంటే మాత్రం కలిసి పోటీ చేసేందుకు ఆలోచిస్తానన్నారు.

Image result for k a paul party

ఆంధ్రప్రదేశ్ ఎటు పోతోందో.. ఏమైపోతోందోననే భయం తనను వెంటాడుతోందని పాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసమే తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దారుణాలు జరుగుతాయన్నారు. టీడీపీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్న పాల్.. రాష్ట్ర ప్రజలను ఆ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు.

Image result for k a paul party

ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పాల్ వెల్లడించారు. కేవలం ఒక ఏడాదిలోనూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. అంతేకాక.. గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పాల్ చెప్పారు. ఇంటింటా శాంతి నెలకొల్పాలనేదే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమన్నారు.

Image result for k a paul party

కె.ఎ.పాల్ ఏం మాట్లాడినా, ఏం చేసినా ఎంతో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో కూడా చాలా హడావుడి చేశారు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఈసారి కూడా ఎన్నికల ముందు మళ్లీ హడావుడి చేస్తున్నారు. పెద్దపెద్ద పార్టీలే తాము రంగంలోకి దిగుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నాయంటున్నారు. మరి చూద్దాం ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: