1947 ఆగష్ట్ 15 న మనకు స్వాతంత్రం వచ్చినా, మనల్ని మనం పాలించు కోవటం కోసం నిర్మించుకున్న చట్టం భారత రాజ్యాంగం దీన్ని లిఖించటానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజు ల సమయం పట్టింది. 1950 జనవరి 26 న భారత (బ్రిటీష్) ప్రభుత్వ చట్టాన్ని (1935) వదిలేసి భారత రాజ్యాంగం దేశపరిపాలనకు వర్తింపజేసిన రోజును భారత గణతంత్ర దినం అంటారు. భారత రాజ్యాంగసభలో 1949 నవంబరు 26 న రాజ్యాంగం ఆమోదం పొందింది.


భారతదేశం స్వతంత్ర గణతంత్రం గా అంటే సార్వభౌమరాజ్యంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26 లో దీనిని ఒక ప్రజా తంత్ర పరిపాలన పద్ధతిలో అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.  జనవరి 26 నే నిర్ణయించటానికి ఒక చారిత్రక కారణం ఉంది. 1930 లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ ని జనవరి 26 రోజే ప్రకటించుకుంది. ఆ సుప్రసిద్ధ సంఘట నను చిరస్మరణీయం చేయటానికి  సంపూర్ణ రాజ్యాంగం అమలును ఆ రోజున చేయాలని నిర్ణయించారు.
Image result for republic day images
1950 జనవరి 26 న భారత దేశానికి తానే రాసుకున్న రాజ్యాంగం అమలులోకి తెచ్చుకుంది. భారత దేశం లోని అన్ని ప్రాంతాల నుంచి గెలు పొందిన రాజనీతిఙ్జులు, రాజకీయవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులు కలసి నియమించిన నిపుణులంతా కలిసి భారత రాజ్యాంగ చర్చలు జరిపి నిర్ణయాల చేసి వాటిని వాటిని సభలో ఆమోదించటం ద్వారా రాజ్యాంగ రచన పూర్తైంది. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. 


జనవరి 26 ను గణతంత్ర దినోత్సవం గా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం గా వ్యవహరించారు. ఐతే దేశ స్వతంత్ర దినం ఆంగ్లేయులు నిర్ణయించడంతో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవం అంటే సర్వసత్తాక, ప్రజాస్వామిక, సామ్యవాద లౌకిక, గణతంత్ర రాజ్యం గా అవతరించిన రోజన్న మాట. అప్పటి నుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా లేదా భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఆ రోజున మన దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.  

Image result for republic day images

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది. దీనికి అధ్యక్షులుగా డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల లిఖిత రాజ్యాంగాల్లో అతిపెద్దది.

Image result for indian constitution book
రాజ్యాంగ నిర్మాణ చరిత్ర 

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వతంత్రం సిద్దించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. 
Related image
దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు  1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది.  ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను (డ్రాఫ్ట్) రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్) కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారుచేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారుచేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో పూర్ణ స్వరాజ్యం కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26 ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపు నిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపు కొనటం సాంప్రదాయంగా మారింది.  


*స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.

*రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. 

* రాజ్యాంగ రాత ప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.

*భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24 న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.

*1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగసభ రద్దయి, భారత తాత్కాలిక పార్లమెంటు గా మారింది.

*1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.

*మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీ లో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి

*మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.

*1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని ప్రకటిత స్వతంత్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడ డానికి నిర్ణయించుకున్న రోజు.

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: