జగన్ పార్టీ నుంచి బయటికి వచ్చిన వంగవీటి రాధా ప్రెస్ మీట్ పెట్టి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినాడు. రెండు రోజుల్లో అన్ని విషయాలు చెబుతునని చెప్పిన రాధా జగన్ గురించి చాలా విషయాలు మాట్లాడినాడు. అయితే ఒక రోజు రాధా తన తండ్రి విగ్రహావిష్కరణ వెళ్లడం వల్ల....  జగన్ ఇది నా పార్టీ అని ఎవరిని నువ్వు అడిగి విగ్రహావిష్కరణ వెళ్లావని, తండ్రి లేదని జాలి చూపిస్తున్నానని డైరెక్ట్ గా మొహం ముందే   జగన్  మాట్లాడినాడని రాధా ప్రెస్ మీట్ లో చెప్పాడు. 


వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!

అయితే రాధా టీడీపీ లోకి వస్తాడని ప్రచారం ఊపందుకోవడం తో దేవినేని ఫామిలీ గుర్రుగా ఉంది. వంగవీటి దేవినేని ఫ్యామిలీలకు కృష్ణ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా వైరం ఉంది. హత్యలు హత్యాకాండలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాధా అవన్నీ మరిచిపోయి టీడీపీలోకి రావడం ఆయన అభిమానులను కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. అవినాష్ కు న్యాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారట.. గుడివాడ సీటు ఇస్తానని బాబు చెప్పగా.. నూజివీడుపై ఆసక్తితో అవినాష్ పనిచేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు రాధా రాకతో వైసీపీలోకి జంప్ చేసేందుకు అవినాష్ రెడీ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.


వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!

.దేవినేని అవినాష్ కు వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా వైసీపీకి విజయవాడ ఎంపీ సీటులో సరైన అభ్యర్థి కోసం శూలశోధన చేస్తున్నారు. ఇప్పుడు అవినాష్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని వైసీపీ యోచిస్తోందట.. రాధా టీడీపీలోకి వెళ్లగానే ఆయన స్థానాన్ని  భర్తీ చేసేందుకు వైసీపీ పెద్దలు అవినాష్ కు గాలం వేస్తునట్టు ప్రచారం జరుగుతోంది. శత్రువు టీడీపీలోకి చేరిన నేపథ్యంలో తన సీటుపై హామీ ఇవ్వని బాబుకు అవినాష్ జలక్ ఇచ్చి వైసీపీలో చేరుతారా? లేదా కొనసాగుతాడా అన్నది వేచిచూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: