చిగురుపాటి జయరాం హత్య కేసులో మలుపులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ హత్య తానే చేశానని శిఖా చౌదరి మాజీ బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే తన భర్తకు బంధువుల నుంచే ప్రాణహాని ఉందని, వేరేవాళ్లతో ఎలాంటి ఇబ్బందులూ లేవని జయరాం భార్య పద్మశ్రీ మీడియా ముందు నోరు విప్పింది. ఇదిప్పుడు మరింత సంచలనం కలిగిస్తోంది.

Image result for chigurupati jayaram

పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఇప్పటి వరకూ ట్విస్ట్ అంతా ఆయన మేనకోడలు శిఖా చౌదరి చుట్టూనే తిరిగింది. తన కంపెనీలన్నింటిలో శిఖా చౌదరిని భాగస్వామిని చేయడం, తనతో ఎఫైర్ పెట్టుకోవడం.. శిఖాకు వేరేవాళ్లతో ఎఫైర్స్ ఉన్న విషయాన్ని గ్రహించడం.. ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరి మధ్యా విభేదాలు పొడచూపడం.. లాంటివి ఈ అనుమానాలకు దారితీశాయి. ఆస్తికోసం శిఖా చౌదరే జయరాంను చంపించి ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఈ హత్యతో శిఖాకు ఏమాత్రం సంబంధం లేదని తేలింది.

Image result for chigurupati jayaram

రాకేష్ రెడ్డి అనే వ్యక్తి జయరాంను మర్డర్ చేసినట్టు పోలీసులు ధృవికరించారు. రాకేష్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసినట్టు సమాచారం. తనకు జయరాం రూ.4.5కోట్లు బకాయపడ్డాడని, దానికోసం మాట్లాడేందుకు జయరాంను ఇంటికి పిలిచానని రాకేష్ చెప్పాడు. ఈ సమయంలోనే జయరాంను ఒక దెబ్బ కొట్టానని, దానికే జయరాం చనిపోయాడని పోలీసులకు వివరించాడు. దీంతో జయరాం డెడ్ బాడీని రాత్రి వరకూ ఇంట్లోనే ఉంచుకుని ఆ తర్వాత కారులో తీసుకెళ్లి నందిగామ దగ్గర వదిలేశి బస్సులో హైదరాబాద్ వచ్చేసినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మర్డర్ రాకేష్ రెడ్డే చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Image result for chigurupati jayaram

శిఖా చౌదరి – రాకేష్ రెడ్డి మధ్య చాలాకాలం ఎఫైర్ ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించారు. అయితే శిఖా చౌదరికి చాలా మందితో ఎఫైర్స్ ఉండడం వల్లే శిఖాను తాను వదిలేసినట్లు రాకేష్ రెడ్డి చెప్పాడు. అయితే శిఖా తన దగ్గర చాలా ఖర్చు చేసిందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో శిఖా – రాకేష్ మధ్య సంబంధాన్ని జయరాం జీర్ణించుకోలేకపోయాడు. శిఖాను వదిలేయాలంటూ అల్టిమేటం జారీ చేశాడు. అయితే తన దగ్గర తీసుకున్న రూ.3.5కోట్ల అప్పు, తాను శిఖాకు ఖర్చుపెట్టిన రూ.కోటి కలిపి ఇచ్చేస్తే వదిలేస్తానని డీల్ సెట్ చేసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ డబ్బులకోసమే జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి పిలిపించుకున్నట్టు తెలుస్తోంది.

Image result for chigurupati jayaram

అయితే తన భర్తకు వేరే వాళ్ల నుంచి ప్రాణహాని లేదని జయరాం భార్య పద్మశ్రీ మీడియాకు వివరించారు. అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. మీటింగ్స్ కోసమే జయరాం అమెరికా నుంచి ఇండియా వచ్చినట్టు చెప్పారు. శిఖా చౌదరి మనీ మైండెడ్ అని.. అందుకే ఎక్స్ ప్రెస్ టీవీ నుంచి ఆమెను తప్పించానని పద్మశ్రీ వెల్లడించారు. మొదటి భార్య నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. తన అక్క వల్లే ప్రాణహాని ఇబ్బంది ఉందంటూ పలుమార్లు జయరాం చెప్పేవాడని ఆమె తెలిపారు. దీంతో జయరాం మర్డర్ మరో మలుపు తిరిగింది. అతడిని రాకేష్ రెడ్డి అప్పుకోసమే హత్య చేశాడా.. లేక ఈ హత్య వెనుక వేరే వాళ్లెవరైనా ఉన్నారా అనే అంశాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: