ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెర లేచింది. ఏపీ రాజకీయం అంతా కులం చుట్టూ తిరుగుతుందని ఓ అభిప్రాయం ఉంది. ఇప్పుడు అది నిజమని మరోసారి నిజమవుతుంది. సోమవారం టీడీపీ ప్రభుత్వం తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసిన జగన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.

Image result for JAGAN EC COMPLAINT


చంద్రబాబు ప్రభుత్వం సీఐలను డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చిన జాబితాలో 37 మందిలో 35 మంది కమ్మ కులస్తులే ఉన్నారంటూ జగన్ సంచలన ఆరోపణ చేశారు. అందుకు సాక్ష్యంగా ఓ జాబితా కూడా చూపించారు. ఇదే నిజమైతే చంద్రబాబు సర్కారు కులగజ్జి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related image

కానీ ఈ జాబితాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్లకు ఓ విధానం ఉంటుందని దాని ప్రకారం 35 మంది ఒకే కులం వారికి ఇచ్చే అవకాశం లేదని టీడీపీనేతలు అంటున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ జగన్ దీన్ని నిరూపించాలని సవాల్ విసిరారు కూడా.



మరి జగన్ ఇచ్చినా జాబితాను వైసీపీ విడుదల చేసి ఉంటే బావుండేది. జగన్ పత్రిక సాక్షిలోనూ ఈ లిస్టు ఇచ్చి ఉంటే.. క్లారిఫై చేసుకునే ఛాన్సు ఉంటుంది. మరి టీడీపీ నేతలైనా ఆ జాబితాలో ఉన్నవారి సామాజిక వర్గాలను బయటపెట్టి తమ నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. చూడాలి. ఈ కుల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: