తాజాగా జరిగిన పార్లమెంటు చివరి సమావేశంలో ప్రధాని మోడీ చివరి ప్రసంగం చేశారు. ఆఖరి రోజు సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగం జాతీయ స్థాయిలోనే సంచలనం రేపింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లి పోయిందని పేర్కొన్నారు. ఇంకా మోడీ మాట్లాడుతూ... మూడు దశాబద్దాల తర్వాత పూర్తి మెజారిటీతో తాము అధికారంలోకి వచ్చామన్నారు.
ఈ పార్లమెంటులోనే ఎక్కువ మంది మహిళా సభ్యులు ఉన్నారని, ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. నేడు దేశంలో ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతోంది, ఎక్కువ శాటిలైట్లను అంతరిక్షానికి పంపించామని పేర్కొన్నారు.
మానవీయకోణంలో పలు దేశాలకు సహాయపడ్డామని తెలిపారు. అవినీతిని నిర్మూలించేందుకు పలు కొత్త చట్టాలు తీసుకువచ్చామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తమను విడిచిపోయిందని, టీడీపీతో పాటే తమకు టెన్షన్లు కూడా పోయాయన్నారు.
చాలా చమత్కారంగా మోడీ సభలో ప్రసంగించారు. దీంతో చివరి రోజు మోడీ చేసిన ప్రసంగం సభను హోరెత్తించింది. మరోపక్క విపక్ష పార్టీ సభ్యులు మోడీ చేస్తున్న ప్రసంగాన్ని చాలా క్షుణ్ణంగా వింటూ ఏమీ మాట్లాడకుండా కామ్ గా కూర్చున్నారు. మొత్తంమీద చివరిరోజు మోడీ చేసిన ప్రసంగం జాతీయ మీడియా ఛానల్ లో హోరెత్తించింది.