వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన విజయవంతమైంది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ విజయాన్ని టీడీపీ లైట్ గా తీసుకుంటోంది. అంతే కాదు.. అనేక ఆరోపణలు కూడా చేస్తోంది. అందులో ప్రధానమైంది.. వైసీపీ బీసీ గర్జనకు తెలంగాణ నుంచి జనాన్ని లారీల్లో తరలించారట.



జగన్మోహన్ రెడ్డికి మంత్రి కిమిడి కళావెంకటరావు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయం ప్రస్తావించారు. బీసీలు లేని బీసీ గర్జనకు తెలంగాణ నుంచి బస్సులు పెట్టి ప్రజలను తరలించడంతోనే నవ్యాంధ్రలో బీసీలంతా టీడీపీతోనే ఉన్నారని రుజువైందంటున్నారాయన.



పాముకి పాలు పోసినా.. జగన్‌ రెడ్డికి బీసీలు ఓటు వేసినా.. వారు కాటుకు గురికాక తప్పదని వైఎస్‌ కుటుంబ చరిత్ర స్పష్ట పరుస్తోందని ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. వైఎస్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు. మీ తాతా బైరైటీస్‌ గనుల యజమాని జింకా వెంకటనరసయ్య ఆశ్రయమిస్తే.. ఆయన్నే చంపి ఆ గనిని ఆక్రమించుకున్నాడన్నారు. మేకవన్నె పులి అని తెలియక ప్రజలు మీ తండ్రికి అధికారం అప్పగిస్తే.. ఆయన బీసీలపై కక్ష సాధించారని లేఖలో తెలిపారు.

సంబంధిత చిత్రం


రిజర్వేషన్‌ శాతం పెంచకుండా 31 కులాలను బలవంతంగా బీసీ జాబితాలో చేర్చి బడుగుల నోరు కొట్టారని.. ఒకసారి మోసపోయి పొరపాటు పడ్డామని బడుగు వర్గాలు భావిస్తున్నాయి. రెండోసారి, మోసపోవటానికి బీసీలు సిద్ధంగా లేరని కళా వెంకట్రావు అంటున్నారు. బీసీలను మరోసారి మోసం చేయడానికే.. బీసీ గర్జన సభ పెట్టారని.. చంద్రబాబు ప్రభుత్వం రూ.32వేల కోట్లు ఖర్చు చేసిందని లేఖలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: