నమ్మి వెంట వెళ్లినందుకు అత్యంత దారుణంగా తన స్నేహితులతో హత్య చేశాడు..అయితే ఆ హత్య తనపై పడకుండా తాను కూడా గాయపడినట్టు నటించి పోలీసులను బురిడీ కొట్టించాలని చూశాడు..కానీ పాపం ఏనాటికీ దాగదు అని తేలింది.  అమరావతి ప్రాంతంలో పెను కలకలం రేపిన జ్యోతి హత్యకేసును మంగళగిరి పోలీసులు ఛేదించారు.  జ్యోతిని తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లిన ప్రియుడు శ్రీనివాసే ప్రధాన నిందితుడని తేల్చారు.  కొంత కలాంగా మృతురాలు జ్యోతిని ప్రేమించినట్లు నటించిన శ్రీనివాస్ తర్వాత ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. 


కానీ ఆమె వివాహం చేసుకోమనడంతో ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం పన్నాడు.  ఈ నేపథ్యంలో మాయ మాటలు చెప్పి తన బైక్ పై ఎక్కించుకొని నిర్మాణుష ప్రదేశానికి తీసుకు వెళ్లాడు.  అప్పటికే పథకం ప్రకారం తన స్నేహితులు అక్కడ మాటువేశారు.  శ్రీనివాస్, జ్యోతిల మద్య కొద్ది సేపు వాగ్వీవాదం నడిచింది. వెంటనే తన స్నేహితుడు పవన్ ని పిలిచి మె కాళ్లు, చేతులను శ్రీనివాస్ గట్టిగా పట్టుకోగా, పవన్ ఓ ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడని, ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తరువాత, తనపై ఎవరికీ అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో శ్రీనివాస్, తన తలపైనా కొట్టించుకున్నాడని పోలీసు అధికారులు తేల్చారు.

Image result for jhothi murder case srinivas

గతంలో కూడా పలువురు అమ్మాయిలను ప్రేమ పేరుతో నిర్మాణుష ప్రదేశాలకు తీసుకు వెళ్లి వారి నగ్న వీడియోలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు గుర్తించామని అన్నారు. ఈ కేసులో శ్రీనివాస్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని జ్యోతి బంధువులకు హామీ ఇచ్చారు. కాగా, హత్యకు ముందు జ్యోతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని..పోలీసులు స్పష్టం చేశారు.  హత్య తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ డిశ్చార్జ్ కాగా, ఆ వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: