తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడినా కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.  తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఆలస్యం అయ్యింది.  ఈ మద్యలోనే సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది.  ఈసారి మంత్రి వర్గ విస్తరణలో కొత్తవారికి చోటు దక్కింది. 

అయితే ఎన్నికల సమయంలో అపోజీషన్ పార్టీ వారు తెలంగాణ మంత్రి వర్గంలో మహిళలకు ప్రాదాన్యత లేదని ఎద్దేవా చేశారు.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త తెలిపారు. త్వరలోనే మరోసారి కేబినెట్ విస్తరణ చేపడతామనీ, ఈసారి ఇద్దరు మహిళలకు మంత్రి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలల్లో భాగంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేని విషయాన్ని గుర్తుచేశారు.

నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు స్పందించారు.  తమకు మహిళలపై అమితమైన గౌరవం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలే తమకు ఓట్లు వేశారనీ, అందువల్లే తాము ఇక్కడ కూర్చున్నామని సీఎం వ్యాఖ్యానించారు. మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. మంత్రివర్గంలో గరిష్టంగా 17 మందిని మాత్రమే తీసుకునే వీలుందనీ, వీరిలో ఇద్దరు మహిళలను కచ్చితంగా తీసుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. దీంతో పలువురు సభ్యులు ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: