గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. ఈసారి ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.
మార్చి 18 మొదటి నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 11 తోలివిడత పోలింగ్, ఏప్రిల్ 18 రెండోవ విడత పోలింగ్, ఏప్రిల్ 23 వ తేదీన మూడవ విడత పోలింగ్, ఏప్రిల్ 29 నాలుగో దశ పోలింగ్, మే 6 ఐదవ విడత పోలింగ్, మే 12 ఆరో విడత పోలింగ్, మే 19 ఏడోవ విడత పోలింగ్ జరుగుతుంది.
మరింత డిటైల్స్ లోకి వెళ్తే..
ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా 7విడతల్లో ఎన్నికలు… ఓట్ల లెక్కింపు : మే 23
1) మొదటి విడత ఎన్నికలు: ఏప్రిల్ 11న 20రాష్ట్రాల్లోని 91నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అరుణాచల్ ప్రదేశ్ (2), అసోం (5), బిహార్ (4), ఛత్తీస్గఢ్ (1), జమ్ముకశ్మీర్ (2), మహారాష్ట్ర (7), మణిపూర్ (1), మేఘాలయ (2), మిజోరం (1), నాగాలాండ్ (1), ఒడిశా (4), సిక్కిం (1), త్రిపుర (1), ఉత్తర్ప్రదేశ్ (10), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ్బెంగాల్ (2), లక్షద్వీప్ (1), అండమాన్ నికోబార్ (1)
2) రెండవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 18న 13రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు
జమ్ముకశ్మీర్ (2), అసోం (5), బిహార్ (5), ఛత్తీస్గఢ్ (3), కర్ణాటక (14), మహారాష్ట్ర (10), మణిపూర్ (1), ఒడిశా (5), తమిళనాడు (39), త్రిపుర (1), ఉత్తర్ప్రదేశ్ (8), పశ్చిమ్ బెంగాల్ (3), పుదుచ్చేరి (1)
3) మూడవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 23న 14రాష్ట్రాల్లోని 115నియోజకవర్గాలు
అసోం (4), బిహార్ (5), ఛత్తీస్గఢ్ (7), గుజరాత్ (26), గోవా (2), జమ్ముకశ్మీర్ (1), కర్ణాటక (14), కేరళ (20), మహారాష్ట్ర (14), ఒడిశా (6), ఉత్తర్ప్రదేశ్ (10), పశ్చిమ్బెంగాల్ (5), దాద్రానగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1)
4) నాలుగవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 27న 9రాష్ట్రాల్లోని 71నియోజకవర్గాలు
బిహార్ (5), జమ్ముకశ్మీర్ (1), ఝార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర (17), ఒడిశా (6), రాజస్థాన్ (13), ఉత్తర్ప్రదేశ్ (13), పశ్చిమ్బెంగాల్ (8)
5) ఐదవ విడత ఎన్నికలు:
మే 6న 7రాష్ట్రాల్లోని 51నియోజకవర్గాలు
బిహార్ (8), జమ్ముకశ్మీర్ (2), మధ్యప్రదేశ్ (7), ఝార్ఖండ్ (4), రాజస్థాన్ (12), ఉత్తర్ప్రదేశ్ (14), పశ్చిమ్బెంగాల్ (8)
6) ఆరవ విడత ఎన్నికలు: మే 12న 7రాష్ట్రాల్లోని 59నియోజకవర్గాలు
బిహార్ (8), హరియాణా (10), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), ఉత్తర్ప్రదేశ్ (14), పశ్చిమ్బెంగాల్ (8), దిల్లీ (7)
7) ఏడవ విడత ఎన్నికలు: మే 19న 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు
బిహార్ (8), ఝార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్ (13), పశ్చిమ్బెంగాల్ (9), చండీగఢ్ (1), ఉత్తర్ప్రదేశ్ (13), హిమాచల్ ప్రదేశ్ (4)