వైఎస్ జగన్.. ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. ఆయన పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లోఅధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆయన సీఎం అవుతారని జోస్యం చెబుతున్నాయి. ఆయన గురించిన మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం..
1. జగన్ చదువుకున్నది ఏంటో తెలుసా.. ఆయన క్వాలిఫికేషన్ బీకాం. హైదరాబాద్ బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 12 వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజీ లో బికాం చదివారు. ఎంబీఏ చేసేందుకు లండన్ వెళ్లినా అది పూర్తి కాకుండానే ఏపీకి వచ్చేశారు.
2. రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగుళూరు లోని లాంకో హిల్స్ లో జాబ్ చేసేవారు. ఈ లాంకో హిల్స్ ఎవరిదో తెలుసు కదా. లగడపాటి రాజగోపాల్ ది.
3. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ జగన్. సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాల వల్లే జగన్ బాలకృష్ణ కి ఫ్యాన్ అయ్యారని అంటుంటారు.
4. జగన్ పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి సంచలనం సృష్టించింది. జగన్ చిన్న కూతురు హర్ష రెడ్డి.
5. సొంతగా పార్టీ పెట్టి 70 సీట్లు సాధించారు జగన్. ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఎన్ఠీఆర్ తర్వాత జగన్ ఉన్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. దేశంలో జరిగిన సుదీర్ఘ పాదయాత్రల్లో ఇది ఒకటి.