ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టిడిపి ప్రజల మన్నలను పొందుకోవడానికి...రాబోతున్న ఎన్నికల్లో గెలవడానికి నానా తంటాలు మరియు ఇక్కట్లు పడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసిపి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం తధ్యమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఓటమి భయంతో నిండిపోయారు రాష్ట్ర టిడిపి పార్టీకి చెందిన వారు.

దీంతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలవడానికి దొడ్డి దారులు మరియు గుంటనక్క దారులు తొక్కడానికి రెడీ అయిపోతుంది. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ పార్టీ కి తిరుగులేని నేపథ్యంలో ఎలాగైనా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాగా వేయాలని ఇప్పటికే రక్త చరిత్ర రాజకీయాలు మొదలుపెట్టిన విషయం మనకందరికీ తెలిసినదే.

అయితే ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న టిడిపి తన చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను దుర్వినియోగ పరుస్తూ ఏ ఊరిలో అయితే వైసీపీ పార్టీ కి పట్టు ఉందో ఆ ప్రాంతంలో పోలీసులను ఏర్పరిచి ఆ ప్రాంత ప్రజలను వైసీపీ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

అంతేకాకుండా పోలీసుల భద్రతలో వైసీపీకి పట్టున్న ఊళ్లలో ప్రచారం చేయడానికి ప్రజలు కనడబకున్నా గోడలకు పోస్టర్లు అలికిస్తున్న తిక్కారెడ్డి బృందం..  ఇక వైఎస్ అవినాష్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ప్రచారానికి బయలు దేరితే మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు..ఎంత వరకు న్యాయం అని అంటున్నారు వైసీపీ పార్టీ కి చెందిన నాయకులు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగ పరుస్తున్నారు చంద్రబాబు అంటూ మండిపడుతున్నారు వైసిపి పార్టీకి చెందిన వారు .


మరింత సమాచారం తెలుసుకోండి: