దాదాపు 3000 కిలోమీటర్ల జగన్ పాదయాత్ర ఓ సంచలనం.. అయితే ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు తండ్రి బాటలో వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో ఆయన ప్రజలను అభిమానంతో పెట్టిన ముద్దులు కూడా చాలా చర్చకు దారి తీశాయి. 



జగన్ పాదయాత్రలో తనను పలకరించేందుకు వచ్చిన ప్రజలకు అభిమానంపై వారి నుదుడిపైనో.. తలపైనో ముద్దు పెట్టడం అలవాటు. అయితే కొందరు అభిమానంతో జగన్‌కు బుగ్గపైనా, పెదవులపైనా ముద్దులు పెట్టేసి జగన్ ను ఇబ్బందులు పెట్టేశారు.



ఐతే.. ఇదంతా ప్లాన్ ప్రకారం సాగుతున్న ముద్దుల కథ అంటున్నారు కొందరు. ఓ ప్రముఖ ఛానళ్లలో చర్చలో పాల్గొన్న ఆర్‌ కె అనే సెఫాలజిస్టు.. ఇదంతా పక్కా ప్లాన్డ్‌ ముద్దుల యాత్ర అంటున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. జగన్ పాదయాత్ర కోసం ఉన్న ఓ ప్రత్యేక టీమ్ ఉంటుందట. 



జగన్ తో ముద్దులు పెట్టించుకునే వారిని ముందుగానే సెలక్ట్ చేస్తారట. వారికి తలా 500 రూపాయలు ఇస్తారట. వాళ్లను ఫ్రెష్ గా స్నానాలు చేసి రమ్మని చెబుతారట. ఆ తర్వాత జగన్ వారికి ముద్దులు పెడతారట. మరి ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో. సదరు సెఫాలజిస్టు అచ్చం టీడీపీ కార్యకర్తలాగానే మాట్లాడటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: