ఏపీ పల్స్ హీటెక్కిస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కాబోయే సీఎం ఎవరు మళ్లీ చంద్రబాబేనా.. లేక జనం ఈసారి జగన్ కు పట్టం కడతారా అన్న ఆత్రుత, ఆసక్తి అందరిలోనూ ఉన్నాయి. ఈ ఉత్కంఠకు కాస్త తెరదించేందుకు అనేక సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి
ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా కాకినాడతో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది. కాకినాడ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బలంగానే ఉన్నాయి.
అంటే పోటీ హోరాహోరీగా ఉందన్నమాట. ఈ పోరులో టీడీపీ, జనసేన కంటే వైసీపీ బలంగా ఉందని సర్వే రిపోర్టు చెబుతోంది. ఈ రెండు పార్టీల కంటే వైసీపీ కనీసం 50 వేల ఓట్లు ఎక్కువ సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.
ఇంతటి టఫ్ ఫైట్లో 50 వేల ఓట్లు అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇంత ఆధిక్యం ఉన్న తర్వాత దాన్ని తిరగబడేలా చేయడం చాలా కష్టం. కాబట్టి కాకినాడ ఎంపీ నియోజకవర్గంపై వైసీపీ జండా ఎగరడం ఖాయమని సర్వే చెబుతోంది.