ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలలో  ఎలాగైనా తిరిగి అధికారం సంపాదించాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు.

Image result for jagan

ఇదే క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు గత ఎన్నికలలో కొద్దిపాటి ఓటింగ్ తేడాతో అధికారం కోల్పోవడంతో ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా ఉండాలని...అందివచ్చిన ప్రతి అంశాన్ని పైకి లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల లో మరింతగా పెంచుతున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు.

Image result for jagan

ఇలా ఉండగా వైసీపీ అధినేత జగన్ ఇటీవల గన్నవరం నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పై చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వంశీ ...వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు జైలుకు వెళ్లారు కాబట్టి మమ్మల్ని కూడా పంపించాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నిస్తూ లేనిపోని అవినీతి ఆరోపణలు తనపై చేస్తే పరువు నష్టం దావా కేసు వేసి మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కి స్థానాన్ని జగన్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. రాబోతున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి అవటం తర్వాత...సరిగా మాట్లాడకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ జగన్ పై విరుచుకు పడ్డారు వల్లభనేని వంశీ.



మరింత సమాచారం తెలుసుకోండి: