డబ్బు, మద్య, ఎన్నికలనగానే గుర్తుకు వస్తాయి. ఈ రెండు పదాలే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం, కాన్ని లక్షల మంది ప్రాణ త్యాగం, ఇవన్నీ కూడా మందుసీసా, పచ్చనోటు ముందు వెల వెల పోతున్నాయన్నట్లుగా తయారవుతుంది మన ఎన్నికల పరిస్థితి. ఇంకా మొదటి దశ ఎన్నికలు పూర్తి అవలేదు, అప్పుడే 540 కోట్ల ధనాన్ని, వందల కోట్ల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది ఎన్నికల కమిషన్. 


మన తెలుగోళ్ల ఖర్మ ఏమిటంటే..29 రాష్ట్రాల భారత దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో మొట్టమొదట నిలిచిన అఖ్యాతి ఆంధప్రదేశ్ కే  కట్టబెట్టిన మన పాలకులు.. ఈ ఎన్నికల్లో పంచడానికి సిద్దం చేసిన అక్రమ డబ్బు, మద్యంలో కూడా ముందంజలో ఉన్నారట.


దేశ వ్యాప్తంగా 540 కోట్లు పట్టుబడితే దాదాపు 110 కోట్లు మన ఆంధప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే పట్టుబడ్డాయట. అభివృద్ది లో మొదటి స్థానం తీసుకురండి పాలకుల్లారా ఇలాంటి అవినీతి-అరాచకాల్లో కాదంటూన్నారు ఆంధప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: