ఏపీలో ప్రధాన మీడియా అంతా వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి పత్రిక జగన్ పై బురద జల్లేందుకు రెడీగా ఉంటుందని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు.  తాజాగా సినీ రచయిత పోసాని కృష్ణమురళి ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. 


నారా లోకేశ్ అమెరికాలో మహిళలతో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను ఆయన మీడియాకు చూపారు. ఇలాంటి ఫోటోలు జగన్ కు సంబంధించినవి బయటకు వస్తే.. ఇదే ఆంధ్రజ్యోతి నానా యాగీ చేస్తుందని పోసాని మండిపడ్డారు. మరి లోకేశ్ విషయంలో ఇలాంటి ఫోటోలు ప్రచురించే దమ్ముందా అని ప్రశ్నించారు.

ఇలాంటి ఫోటోలు జగన్ వి దొరికితే.. అమ్మ జగన్.. నీకు అమ్మాయిల అలవాటు ఉందా. అమ్మ జగనా నీకు మందు అలవాటు ఉందా.. అంటూ రోజూ సీరియల్‌గా ఈ ఫోటలన్నీ వేసేవాడివేగా..అంటూ పోసాని కృష్ణ మురళి ఏబీఎన్ రాధాకృష్ణను కడిగేశారు. నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు.. నా జోలికి రాకు.. అంటూ పోసాని కృష్ణమురళి ఆర్కేపై ఓ రేంజ్‌లో పైర్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: