తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం విషాదంగా మారింది. మండపేటలో జగన్ ప్రసంగం మొదలు పెట్టే సమయంలో గోడ కూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. జగన్ ప్రచారంకోసం మండపేట కూడలిలో వేదిక ఏర్పాటు చేశారు. కారు దిగి ప్రచారరథం పైకి ఎక్కి జగన్ ప్రసంగం ప్రారంభించబోయారు. ఇదే సమయంలో వీధికి ఓ వైపు ఉన్న బిల్డింగ్ పైన కొంతమంది కార్యకర్తలు చేతులు ఊపుతూ కనిపించారు. అయితే ఒక్కసారిగా అది కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం..


ఘటన జరిగిన వెంటనే జగన్ మండపేట సభను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అనంతరం కాసేపటికి జగన్ తన ప్రసంగం ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వైసీపీ శ్రేణులను విషాదంలోకి నెట్టేసింది. అయితే అంతలోనే కోలుకున్న శ్రేణులు.. ఆఘమేఘాలపై స్పందించి జగన్ సభ యధాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాయి. దీంతో సభ సజావుగా సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: