ఎన్నికల సమయంలో తప్ప ఓటేసే ఓటర్లంటే నాయకులకూ ఎప్పుడూ చులకనే. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఓటు కోసం అంతులేని ప్రేమ ఒలకబోస్తారు. కానీ కొందరు మాత్రం ఆ ప్రేమకు కరిగిపోరు.. తమ గోడు వినిపించేందుకు ఇదే తగిన సమయం అని నిలదీస్తారు. 


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అదే జరుగుతోంది. ఇక్కడ టీడీపీ తరపున పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అతని తరపున అతని భార్య కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం ఓ బడుగుల కాలనీలోకి అడుగు పెట్టిన
శ్రీరామ్ భార్యకు కాలనీ వాసులు ప్రశ్నల వర్షంతో చుక్కలు చూపించారు.

తమ కాలనీ సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ఓటు కోసం వచ్చారా అంటూ కడిగిపారేశారు. మీడియా ఉన్నా సరే భయపడకుండా.. తమ బాధలు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగు నీరు కూడా లేదని.. తమ సొంత ఖర్చుతో బోర్లు వేయించుకున్నామని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

దాంతో బిత్తరపోయిన శ్రీరామ్ భార్య మరి ఈ సమస్యలను శ్రీరామ్ దృష్టికి, పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. అందరికీ చెప్పుకున్నాం.. ఎవరూ మా గోడు వినిపించుకోలేదు. అందుకే తెలుగుదేశం జెండా కిందకు తీయించాం.. ఏం చేస్తారో చేసుకోండని గట్టిగానే ఎగబడ్డారు. స్థానికుల నిరసనతో చేసేదేమీ లేక శ్రీరామ్ భార్య వెనుదిరిగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: