ప్రజాశాంతి పార్టీ టీడీపీ కోవర్టు అని వైసీపీ అనుకున్నట్టుగానే జరిగింది. ప్రజాశాంతి- టీడీపీ కుట్ర అడ్డంగా దొరికిపోయింది. ఆడియో రికార్డుల సాక్షిగా మహా కుట్ర బట్టబయలయ్యింది. 
 
ప్రజాశాంతి పార్టీ తరపున వైసీపీ అభ్యర్థుల పేరున్న వ్యక్తులతో నామినేషన్లు వేయించిన విషయం తెలిసిందే. దాదాపు 20 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లున్న వ్యక్తులతోనే ప్రజాశాంతి నామినేషన్ వేయించింది. ఉదాహరణకు పరుచూరులో దగ్గుబాటు వెంకటేశ్వరరావు పోటీ చేసిన సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో ప్రజాశాంతి నామినేషన్ వేయించింది. 

ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అయితే విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో ప్రజాశాంతి పార్టీ నామినేషన్ వేయించింది. అయితే ఈ కుట్ర వెనుక టీడీపీ ఉందన్న సంగతి ఇప్పుడు బట్టబయలైంది. విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరుడు బేరసారాలు సాగించిన ఆడియో ఇప్పుడు బయటికొచ్చింది. 

మీరు కేశవ్ వద్దకు రావాలని.. మీ బయోడేటా ఇస్తా అంతా కేశవ్ మనుషులే చూసుకుంటారని ఆ ఆడియోలో పయ్యావుల కేశవ్ ప్రతినిధి విశ్వనాథరెడ్డితో  చెప్పుకొచ్చారు. డబ్బు విషయాలు కూడా క్లియర్ గా మాట్లాడుకున్న ఆడియో బయటకు రావడంతో టీడీపీ కుట్ర బయటపడింది. ఇప్పుడు ఇది వైసీపీ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: