ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్టణం జిల్లాలో ప్రముఖ రాజకీయ నేతలు మరియు వారి బంధువులు చేస్తున్న హడావిడి చూస్తుంటే విశాఖపట్టణాన్ని ఏపీ రాజకీయాల్లో సెంట్రల్ గా చేసుకుని ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్ద అల్లుడు భరత్ మరియు గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి ఇటీవల జనసేన పార్టీలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్టణం లో ఒక సభలో పాల్గొని నగర అభివృద్ధి గురించి సంచలన కామెంట్ చేశారు.


ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లుడు భరత్ మాట్లాడుతూ..రాజకీయాల్లోకి రావాలని గతంలోనే అనేక ఒత్తిడులు వచ్చాయి...కానీ నా పైన ఉన్న పెద్దలు క్రింది స్థాయి కార్యకర్తల నుండి మరియు సామాన్యుల నుండి మంచి పేరు తెచ్చుకుని పైకి వస్తేనే ఎవరైనా వెనకాల నుండి ప్రోత్సహిస్తారని ముందు అక్కడ ప్రూవ్ చేసుకుని పాలిటిక్స్ లో అడుగు పెడితే బాగుంటుందని సలహాలు ఇచ్చారని ఇటీవల విశాఖ పట్టణ నగర అభివృద్ధి గురించి జరిగిన సభలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇదే క్రమంలో ఈ సభలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం సమస్యల గురించి మరియు నగర అభివృద్ధి గురించి పరిష్కారాల గురించి కొన్ని సలహాలు ఇచ్చారు. మొత్తం మీద ప్రస్తుత రాజకీయాలలో జనసేన పార్టీ టిడిపి కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని అంటున్న తరుణంలో ఈ ఇద్దరు ఒకే వేదికపై పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: