గుడివాడ అసెంబ్లీ పోరు రసవత్తరంగా ఉంది. ఇక్కడ హ్యాట్రిక్ వీరుడైన కొడాలి నానిని టీడీపీ టార్గెట్ చేసింది. ఎలాగైనా కొడాలి నాని ఓడించాలన్న పట్టుదలతో.. స్థానికులకు కాకుండా విజయవాడ నుంచి దేవినేని అవినాశ్‌కు టికెట్ ఇచ్చింది.


ఐతే.. తనపై దేవినేని అవినాశ్ పోటీని కొడాలి నాని లైట్ గా తీసుకుంటున్నారు. అవినాశ్ కుర్రాడని.. అతన్ని బలిపశువును చేస్తున్నారని కామెంట్ చేశారు. అంతే కాదు.. చంద్రబాబు తనను టార్గెట్ చేసి.. తనను ఓడిస్తే పదవులు ఇస్తానని.. గుడివాడ కమ్మ నాయకులను తాయిలాలు ప్రకటించారంటూ ఎద్దేవా చేశారు. 

ఒక కమ్మవాడినైన తనను ఓడించేందుకు.. గుడివాడులోని ముగ్గురు కమ్మనాయకులకు పదవులు ఇస్తానని చంద్రబాబు ఆశ పెట్టారని నాని కామెంట్ చేశాడు. కానీ గుడివాడ నియోజకవర్గంలో కమ్మల ఓట్లు చాలా నామమాత్రమని.. కేవలం 12వేలు మాత్రమే ఉంటాయని గుర్తు చేశారు. 

తాను కమ్మవాడినైనా నియోజకవర్గంలోని బడుగు, బలహీన వర్గాల అభిమానం చూరగొన్నానని.. తనకు వారి ఓట్లపైనే నమ్మకం ఉందని చెప్పారు నాని..  తెలంగాణలో నోటుకు ఓటు కేసులో దొంగలా దొరికిపోయి పారిపోయివచ్చిన చంద్రబాబు.. తనలాంటి ప్రజాబలం ఉన్న వారిని ఏమీ చేయలేరని నాని సవాల్ విసిరారు. చంద్రబాబును నమ్ముకున్న కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. ఎన్నికల తర్వాత చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ కు పారిపోతారని జోస్యం చెప్పారు నాని.  



మరింత సమాచారం తెలుసుకోండి: