ఇటీవల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సినీ నటుడు సీనియర్ నటుడు మోహన్ బాబు విజయవాడలో విలేకరుల సమావేశం పెట్టి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో వైయస్ జగన్ హవా చాల స్పష్టంగా కనబడుతుంది అని చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇతర రాజకీయ పార్టీ నేతలు జగన్ పై చేస్తున్న కేసుల ఆరోపణలలో వాస్తవం లేదని అవి అన్ని రాజకీయ పరంగా పెట్టిన కేసులన్నీ మీడియా ముఖంగా స్పష్టం చేశారు.


అంతేకాకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ముందునుండి చంద్రబాబుని నమ్మిన ప్రతి ఒక్కరు మునిగిపోయారని ఆఖరికి ప్రజలను కూడా ఈనాడు ముంచుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.


అయితే రాబోతున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లిన్ స్వీప్ చేస్తారని ఇదే విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా ఏ విధంగా అయితే అప్పుడు చెప్పానో ఇప్పుడు అదే స్ఫూర్తితో చెబుతున్నాను వైయస్ జగన్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్రాలో క్లిన్ స్వీప్ చేయడం ఖాయమని జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని తేల్చేశారు మోహన్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: