ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌చారానికి వ‌స్తానంటే వ‌ద్దు బాబోయ్ వ‌ద్దంటూ తెలుగు త‌మ్ముళ్లు పారిపోతున్నార‌ట‌. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణంగా హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనిపై మాట్లాడిన నారా లోకేష్ వైఎస్ వివేకా మ‌ర‌ణంతో ప‌ర‌వ‌శించిపోయామ‌న‌డంతో టీడీపీ తమ్ములు అంతా  ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.

ఏ సంద‌ర్భంలో ఏది మాట్లాడాలో తెలియ‌క పోవ‌డంతో పార్టీకి త‌ల‌వంపులు వ‌స్తున్నాయ‌ని, సోష‌ల్ మీడియాలో పార్టీని, నారా లోకేష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నార‌ని పార్టీ వ‌ర్గాలు వాపోతున్నాయి.ఇదిలా వుంటే ఇటీవ‌ల ఓ ప్ర‌చార వేదిక‌పై మాట్లాడుతూ నారా లోకేష్ ప్ర‌భుత్వం ముంద‌ర‌కెళుతోంది. అప్ప‌ట్లో ఊం..ఆ అంటే ***గొచ్చేది అంటూ ప‌చ్చి బూతు ప‌దాన్ని మాట్లాడిన లోకేష్ అంత‌కు ముందు పోర్టే లేని తెలంగాణ‌కు మ‌చిలీప‌ట్నం పోర్టును త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు కేసీఆర్ చేస్తున్నార‌ని మాట్లాడి న‌వ్వుల పాల‌య్యాడు. దీని సోషల్ మీడియా లో అదే పనిగా వీడియోలు పెట్టీ లోకేశ్ ను ట్రాల్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు  సోషల్ మీడియాలో కి రావాలంటే భయపడేలా చేశారు.ఇలాంటి విష‌య‌ప‌రిజ్ఞానం.

ఏం మాట్లాడితే ఏం జ‌రుగుతుందో ఎలాంటి ప‌దాన్ని ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌ని వ్య‌క్తి ప్ర‌చారానికి వ‌స్తే ఇంకేమైనా వుందా? ఓట్లు వేయాల‌ని అనుకున్న వాడు కూడా  లోకేష్ మాట‌లు విని త‌న ఆలోచన మార్చుకునే ప్ర‌మాదం వుంద‌ని, అందుకే లోకేష్‌ను మంగ‌ళ‌గిరికే ప‌రిమితం చేయండ‌ని చంద్ర‌బాబును టీడీపీ శ్రేణులు విన్నవించుకున్నారు అంటా. మరి చంద్రబాబు విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: