ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ముందు కేఏ పాల్ చేస్తున్న హడావిడీ మాములుగా లేదు. కమెడియన్ గా మాట్లాడటం, అందరిని కడుపుబ్బా నవ్వించడంతో టీవీ చానెల్స్ కూడా  కేఏ పాల్ కు ఎక్కడ లేని ప్రాధాన్యత ను ఇచ్చాయి. అయితే  కేఏ పాల్ తన పార్టీ గుర్తు హెలికాఫ్టర్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అంతెందుకు వైసీపీ పార్టీ ఖండువా ను కూడా మక్కి మక్కిగా దించేశాడు. 


అయితే ఎదో  కేఏ పాల్ ఇలా చేయడం వెనుక పెద్ద రాజకీయం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా వైసీపీ పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ఇంటి పేరు మర్చి కేఏ పాల్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. తెరవెనుక  ఎంత భారీ కుట్ర జరిగిందని, దీని వెనుక టీడీపీ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే గుర్తు, అభ్యర్థుల పేర్లు కూడా అలాగే ఉంటే ప్రజలు తిక మక పడి వేరే పార్టీ కి ఓట్లు వేస్తారని స్కెచ్ వేశారు. 


జీవిత మాట్లాడుతూ ఈ విధంగా దొంగ దెబ్బలు తీసి గెలవాలనుకోవటం కరెక్ట్ కాదని దమ్ముంటే జగన్ మాదిరిగా స్ట్రెయిట్ గా ఓట్లను అడగండి అని చెప్పుకొచ్చింది. పదేళ్ల నుంచి పోరాడుతున్న జగన్ మోహన్ రెడ్డి .. నాకు ఓటేయ్యండని అడుగుతున్నాడే తప్ప ఇటువంటి దొంగ దెబ్బలు తీయాలనుకోలేదని చెప్పింది. ఓటు వేసే తప్పదు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: