జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. టీడీపీ మీద విమర్శలు తగ్గించేశాడని .. వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అంతెందుకు ఎన్నికల ముందు ఇలా పవన్ కళ్యాణ్ టీడీపీ మీద విమర్శలు చేయకపోవటంతో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమేగా అని నమ్మాల్సి వచ్చింది. 2018లో టీడీపీ మీద పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. 


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ .. టీడీపీ మీద సైలెంట్ అవ్వడంతో తెర వెనుక జనసేన .. టీడీపీ తో ప్యాకేజీ రాజకీయాలు చేసిందన్న ప్రచారాన్ని వైసీపీ జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయితే ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ మాట్లాడుతూ, టీడీపీని 2018 లో తిట్టాల్సిన విధంగా తిట్టేశానని ఇక తిట్టడానికి ఏం లేదని సెలవిచ్చారు. 


ఇంకా మాట్లాడుతూ, ఇప్పుడు నాకు ప్రధాన ప్రత్యర్థి వైస్సార్సీపీ మాత్రమేనని టీడీపీ కాదని, 2018 లో టీడీపీ అయి ఉండొచ్చు కానీ ఇప్పడు ఆంధ్ర లో టీడీపీ లేదని పరువు తీసేసి మాట్లాడినాడు. తెలంగాణలో సైకిల్ కు గాలి తీసేశారని చెప్పుకొచ్చాడు. తానూ లైఫ్ టైం రాజకీయాలు చేయడానికి వచ్చానని, రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు ఖచ్చితంగా జనసేన తీసుకువస్తుందని చెప్పారు. 

video link : 

https://www.youtube.com/watch?v=3rySf2yFZ_Q&feature=youtu.be

మరింత సమాచారం తెలుసుకోండి: