కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహద్రపురం లో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రజలలోకి వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసి అవన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి నవరత్నాలు ను రూపొందిచారు అని ఆమె చెప్పారు.

జగన్ మాట ఇస్తే తప్పడని కచ్చితంగా ఆయన చెప్పింది చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను చూసి విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారు అంటూ ఆమె చెప్పారు. అయితే జగన్ చేసే పాదయాత్ర కు ప్రచారానికి మంచి స్పందన వస్తుంది అని అన్నారు.ఇంటింటికీ తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా నీటి సమస్య ఉందని ప్రజలు చెబుతున్నారు అని అన్నారు.

ఇప్పుడు ఉన్న నాయకులు అసలు పట్టంచుకోవట్లేదు అంటు వాళ్ళు వాపోతున్నారు అన్నారు.ఇక్కడ ఉన్న అధికార పార్టీ కార్యకర్తలు అభివృధి చేయడంలో విఫలమయ్యారు అంటూ ఆమె మండి పడ్డారు. పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి దాన్ని మరిచారంటూ ఆమె చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నామని చెపుతున్నారు అని అలాంటి రాజన్న రాజ్యం మళ్లీ జగన్ తోనే సాధ్యం అంటూ ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: