నరేంద్ర మోదీ కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ కు అతి పెద్ద శ్రేమోభిలాషి, మిత్రుడు, పెద్దన్న, కావలసినవాడు..దేశంలో ఏ రాష్ట్రానికీ చేయని మేళ్లు ఆంధ్రప్రదేశ్ కి చేసిన ప్రధాని.  మరి ఇప్పుడో.. ఆంధ్ర ద్రోహీ..నమ్మక్ హరామ్, వంచన పరుడు, జనాల్ని చంపినవాడు ఇంకా..ఇంకా..ఇంకా..


ఈ రోజు బాబు ఒక మాట చెప్పారు..పోలవరానికింతిచ్చాము..రొడ్లకంతిచ్చినాము, ఇళ్లు కట్టించినాము అని చెప్పకుంటున్నాడు మోదీ..ఏమైనా మోదీ అబ్బ సొత్తా..ఆంధ్రప్రజలు కట్టిన పన్నులలో రావాలసిన వాటా అది అని చెప్పుకొచ్చారు.  అక్షరాలా నిజమైౌన మాటలు..


ఐతే,  పసుపు కుంకుమిచ్చా, పింఛనిచ్చా, అవిచ్చా..ఇవిచ్చానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న బాబు, తేదేపా ప్రభుత్వం వాళ్ల అబ్బ సొత్తు ఇచ్చిందా అది మాత్రం ఆంధ్రప్రజల కష్టార్జితం కాదా..నక్షత్రాల హోటళ్లుకు కోట్లు, విమానాలకు కోట్లు..ఉపయోగం లేని విదేశీయానానికి కోట్లు ఖర్చెట్టిన డబ్బు కూడా బాబు అబ్బది కాదు మా కష్టార్జితం అంటున్నారు ఆంధ్రప్రజ.  


ఘటనా- ఘటన సమర్థుడు, అపర చాణుక్యుడయిన బాబు ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనాలు తెలివి మీరారు..అందరూ వరన్నమే తింటున్నారని బాబు గుర్తెరగాలని అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: