ఈ నెల 9 వ తేదీ కల్లా పార్టీల ప్రచారాలు ముగిసిపోతాయి. అయితే చివరి రోజు జగన్ .. గాజువాక లో పెద్ద రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. గాజువాకలో పవన్ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన  ఇప్పటికి ఒక రోడ్ షోతో పాటు, ఓ సభ నిర్వహించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. పవన్ బిగ్ సెలిబ్రిటీ. మిగిలిన రెండు పార్టీలకు చెందిన అభ్యర్ధులు సీజనల్ పొలిటీషియన్లు. దాంతో గాజువాక ప్రచారంలో సందడి ఎక్కువగా పవన్ వైపే ఉంటోంది. 


టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికి అనేకసార్లు విశాఖ వచ్చినా గాజువాక వైపు తొంగి చూడడంలేదు. ఏకంగా అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ ప్రచారం చేయాలని కోరినా బాబు మాత్రం ఎందుకో ఆ ఆలోచన చేయడంలేదు. దాంతో పవన్ మ్యానియా మాత్రమే అక్కడ కనిపిస్తోంది. ఇక వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి  తన వరకు తానుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. 


ఈ టైంలో గాజువాకను హీటెక్కించేందుకు వైసీపీ రంగం సిధ్ధం చేసింది. ప్రచారం పరిసమాప్తం అయ్యే చివరి రోజు అంటే ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ గాజువాక టూర్ పెట్టుకున్నారు. ఆ రోజున గాజువాక హోరెత్తించేలా భారీ రోడ్డు షోను నిర్వహించాలను వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఆ రోజుతో ప్రచరం మొత్తం పూర్తి అవుతుంది. దాంతో లాస్ట్ పంచ్ జగన్ దే అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి అక్కడ అటువైపు గబ్బర్ సింగ్, ఇటు వైపు జగన్ ఇలా ఇద్దరూ గాజువాకలో పంతం నీదా నాదా అంటూ సై అంటే జనం ఎవరికి జై కొడతారో చూడాలి.   ఇదిలా ఉండగా నేతల చేరికతో వైసీపీ ఇప్పటికే అక్కడ బలంగా ఉంది. జగన్ ప్రచారంతో సీన్ మొత్తం మార్చేస్తామని కూడా ఆ పార్టీ అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: