నందమూరి లక్ష్మీపార్వతి ఆడియో టేపు కేసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన అసిస్టెంట్ కోటితో ఫోన్‌లోమాట్లాడిన ఆమె.. ఎన్టీఆర్‌ దుర్మార్గాలు చేశారన్నట్టు ఆడియో ఉండటం కలకలం రేపుతోంది. అదే ఆడియోలో ఆమె మోహన్ బాబును కూడా కామెంట్ చేశారు. 


ఈ ఆడియో టేపులలో ఇటీవలే వైసీపీలో చేరిన  మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డు చేసి ఉండొచ్చు. మోహన్ బాబు  చంద్రబాబుపై కోపంతో వైసీపీలోకి వచ్చారని.. మోహన్ బాబు ఒక వేస్ట్ ఫెలో అని లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. 

కోటి.. తనదగ్గర ఉన్న ఈ ఆడియో టేపులు , చాటింగ్ స్క్రీన్ షాట్స్ వంటి ఆధారాలతో లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె అనుచరుడు కోటి. తనకు ఆమెతో ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోటి కోరారు. ఐతే ప్రైవేటు సంభాషణలను ఇలా రికార్డు చేసి రచ్చ చేయడం కూడా మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: