చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇక ఎన్నికల ముందు సమయంలో అయితే ఆయన చేసే కుట్రా రాజకీయాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకుంటుంటారు అశేష ప్రజానీకం. అపర చాణక్యుడు అని పేరున్న చంద్రబాబు గురించి వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.

తన బంధువులను బలి పశువులను చేయడంలో చంద్రబాబు ముందుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని బలవంతంగా పోటీకి దింపి ఓడగొట్టించినట్టే, బాలకృష్ణ అల్లుడు భరత్ ను విశాఖ నుంచి పోటీలో ఉంచి, జనసేన అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. 
జనసేన - టీడీపీకి మధ్య ఉన్న రహస్య పొత్తు కారణంగానే ఇప్పుడు విశాఖ ఎంపీ అభ్యర్థి గా బాలయ్య అల్లుడు భరత్ ను నిలబెట్టాలని, రాబోయే ఎన్నికల్లో అతను ఓడిపోవడం ఖాయం అని ఆయన అన్నారు.  

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "సొంత బంధువులను బలిపశువులు చేయడంలో చంద్రబాబును మించిన వారెవరుండరు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేయించి ఓడగొట్టారు. లోకేశ్ తోడల్లుడు భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చి జనసేన జేడీని గెలిపించాలని క్యాడర్‌ను ఆదేశించారు. లోకేశ్‌కు పోటీ కాకూడదనే ఈ స్కెచ్" అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: