టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు.  గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.  అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు తన అభ్యర్థులను నిలబెట్టి వారి తరుపు నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.  ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.


ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీ లతో పాటు జనసేన కూడా ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉంది. సభలో కూడా జనం పెద్ద ఎత్తున తరలి రావటంతో సభలో ఒక అపశృతి చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ కళ్యాన్ అకస్మాత్తుగా స్టేజ్ పైనే పడిపోయారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు సన్నద్దమౌతున్న సమయంలోనే వెనుక నుండి వచ్చిన ఓ అభిమాని పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొన్నారు.


అంతే ఒక్కసారే అదుపు తప్పి పవన్ కళ్యాన్ కింద పడిపోయారు..వెంటనే ఆయన సిబ్బంది వచ్చి లేపారు.  ఈ ఘటన కారణంగా మైక్  కూడ విరిగిపోయింది.  వెంటనే వపన్ అభిమానిని అదుపులోకి తీసుకొన్నారు.  ఆ తర్వాత ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గతంలో కూడా పవన్ స్పీచ్ ఇస్తున్న సమయంలో కొంత మంది అభిమానులు హఠాత్తుగా పవన్ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: